Mobile Popup Ad
Mobile Popup Ad

ఫుడ్​సేఫ్టీ కోసం ప్రత్యేక యంత్రాంగం : మంత్రి దామోదర రాజనరసింహ

కలం, వెబ్​ డెస్క్​ : ఆహార కల్తీపై (Food Adulteration) కఠిన విధానాలు అమలు చేస్తామని, డ్రగ్స్​ నిర్మూళనకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లే ఆహార భద్రతకు ప్రత్యేక యంత్రాంగం తీసుకొస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ (Damodar Raja Narsimha) తెలిపారు. దీని కోసం సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజాపాలన – ప్రగతి పాలన వారోత్సవాల్లో భాగంగా ఆహార అలవాట్లపై జలవిహార్​ లో నిర్వహించిన వాకథాన్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జె. చొంగ్తు, హైదరాబాద్​ సీపీ సజ్జనార్, ఆహార భద్రతా కమిషనర్ సంగీతా సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్‌తో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి రాజనరసింహ (Damodar Raja Narsimha) మాట్లాడుతూ, సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలతో ఆహార కల్తీ చేసేవారిపై పీడీ యాక్ట్​ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆధునిక జీవనశైలీ, నగరీకరణ వల్ల ప్రజల ఆహార వ్యవహారాలు మారయన్నారు. ప్రాసెస్డ్​ ఫుడ్​, నూనెలు అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుందన్నారు. సరైన తిండితో ఆరోగ్యంగా ఉంటారని.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం కృషి చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు.

Read Also: మావోయిస్టు పార్టీ కీలకనేత సోది కేశాలు లొంగుబాటు..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>