కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఎరువులు కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. వేల్పూరు మండలం జానకంపేటలో కనిపించిన దృశ్యం ఇది. తమ గ్రామానికే ముందుగా ఎరువులు పంపిణీ చేయాలని రైతులు సొసైటీకి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెప్పులు, రాళ్లు లైన్లో పెట్టి వేచి చూశారు. ఇతర గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుంటుండటంతో తమకు ఎరువులు దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఊరి వారికి స్థానికంగా సరఫరా చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.

