కలం, వెబ్ డెస్క్: టెలిగ్రామ్పై (Telegram) తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది. నీట్ పరీక్ష కారణంగా జూన్ 22వ తేదీ వరకు యాప్ను దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పరీక్షల పారదర్శకత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిషేధం అవసరమని సమర్థించుకున్నారు. అంతేగాకుండా, టెలిగ్రామ్ కేంద్రంగా అనేక దారుణ విషయాలు జరుగుతున్నట్లు తమకు తెలిసిందన్నారు. వీటిని అఫిడవిట్ రూపంలో రాబోయే రోజుల్లో కోర్ట్ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.

