కలం, వెబ్ డెస్క్: ఏపీలో మరో పెట్టుబడి రావడంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. “శ్రీ సిటీలో రూ.863 కోట్లతో ‘క్యారియర్ ఏసీ పరిశ్రమ’ ఆధునిక ప్లాంట్ నిర్మించేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఈ యూనిట్ ద్వారా 1,500 టీఆర్ కంటే ఎక్కువ సామర్థ్యమున్న కమర్షియల్ ఏసీలను ఇక్కడే తయారు కానున్నాయి. అలాగే, 15 అధునాతన టెస్టింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం హైఎండ్ ఇండస్ట్రియల్ కూలింగ్ సిస్టమ్స్ రంగంలో మరింత బలోపేతం కానుంది.
ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ కేవలం డేటా సెంటర్లను ఆకర్షించడం మాత్రమే కాకుండా, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పూర్తి మద్దతు ఇవ్వనుంది. అధునాతన ఇంజినీరింగ్, అధిక విలువ కలిగిన తయారీ రంగాల్లో దేశానికే ఏపీ ప్రధాన కేంద్రంగా అవతరిస్తోంది. ఇలాంటి కీలక ప్రాజెక్ట్ తీసుకురావడానికి చర్యలు తీసుకున్న మంత్రి లోకేశ్, క్యారియర్ గ్లోబల్ ఛైర్మన్, సీఈవో డేవిడ్ గిట్లిన్ తదితరులకు అభినందనలు తెలుపుతున్నా” అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) పోస్ట్ చేశారు.
Read Also: తమిళనాడు ప్రభుత్వంపై సస్పెన్స్.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం..?
Follow Us On: WhatsApp

