అక్రమ బదిలీ నిలిపివేయాలని అదనపు కలెక్టర్‌కు వినతి

కలం, నిర్మల్: జిల్లాలోని (Nirmal) సోన్ మండలం కడ్తాల్ అంగన్‌వాడీ కేంద్రానికి జరిగిన బదిలీని వెంటనే నిలిపివేసి, ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ–2 టీచర్ పోస్టును భర్తీ చేయాలని గ్రామస్తుల కోరారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రం రాము మాట్లాడుతూ.. కడ్తాల్ గ్రామంలో మూడు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. వాటిలో అంగన్‌వాడీ-2 కేంద్రంలో పనిచేసిన టీచర్ పదవీ విరమణ చేయడంతో ఆరేండ్లుగా  ఆ పోస్టు ఖాళీగా ఉందన్నారు. అప్పటి నుంచి అంగన్‌వాడీ-1 కేంద్రంలోని టీచర్‌ను డిప్యూటేషన్‌‌పై విధులు నిర్వహించేలా నియమించారని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే ప్రక్రియలో ఉందని గుర్తుచేశారు. దిలావర్‌పూర్ మండలం కాల్వ కేంద్రంలో పనిచేస్తున్న ఏలేటి సరితను కడ్తాల్ అంగన్‌వాడీ-1 కేంద్రానికి బదిలీ చేశారన్నారు. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే సమయంలోనే, ఇలాంటి బదిలీలకు అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీంతో అర్హులైన స్థానిక మహిళలకు ఉద్యోగావకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. నోటిఫికేషన్ సమయంలో బదిలీకి విల్లింగ్ ఇచ్చిన సంబంధిత జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి, సీడీపీఓలపై కూడా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>