తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Chennai) రాష్ట్రంలోని చెన్నై కరూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రైవేట్ కాలేజ్ బస్సును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఆరుగురు పరిస్థితి తీవ్రంగా ఉందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక రైల్వే, పోలీస్ యంత్రాంగం ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడ్డవారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం రైల్వే ట్రాక్ కొద్దసేపు మూసేశారు. ప్రమాద కారణాలను గుర్తించడానికి రైల్వే పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: హోటళ్లు రెస్టారెంట్లకు గుడ్ న్యూస్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>