కలం, వెబ్ డెస్క్ : ఎంఐఎం నేత అక్భరుద్ధీన్ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఫైర్ అయ్యారు. ఒవైసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫాతిమా విద్యాసంస్థ గతంలో మిలిటెంట్లకు షెల్టర్ ఇచ్చింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. చదువు చెప్పే ముసుగులో అక్కడ మిలిటెంట్లను తయారు చేస్తున్నారా? అని బండి అనుమానం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అండతోనే ఒవైసీ బ్రదర్స్ బరితెగించి మాట్లాడుతున్నారని ఆయన (Bandi Sanjay Kumar) ఆరోపించారు. చివరికి హైకోర్టును బెదిరించేలా అక్భరుద్దీన్ వ్యాఖ్యలు ఉండడం దారుణమన్నారు. ఎంఐఎం నేతలకు కోర్టులు అన్నా.. చట్టాలు అన్నా లెక్కలేదన్నారు. ఫాతిమా విద్యా సంస్థల ఇష్యూపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదని బండి నిలదీశారు.
గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలోని విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఒవైసీకి ఒక న్యాయం.. ఇతరులకు ఒక న్యాయమా అని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫాతిమా కాలేజీని కూల్చివేస్తామని ఆయన ప్రకటించారు.

