epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇంధన సంరక్షణలో అవార్డులందుకున్న ఏపీ, తెలంగాణ​

కలం, వెబ్​డెస్క్​: ఇంధన సంరక్షణ, సామర్థ్య​ పెంపు రంగంలో ఏపీ, తెలంగాణ అదరగొట్టాయి. గ్రూప్​–2 కేటగిరీ (Energy Conservation Awards) లో వరుసగా ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించాయి. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా ఏపీ, తెలంగాణ విద్యుత్​ అధికారులు అవార్డులు అందుకున్నారు. ఇంధన సంరక్షణకు తీసుకున్న చర్యలు, ఇంధన సామర్థ్యం అభివృద్దికి సృజనాత్మకంగా, విస్తృతంగా, ప్రభావవంతంగా అమలుచేసిన కార్యక్రమాల కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు అద్భుత ప్రగతిని సాధించి వరుసగా టాప్​లో నిలిచాయి.

ఈ అవార్డులను(Energy Conservation Awards) ఆంధ్రప్రదేశ్​ తరఫున ఏపీఎస్​పీడీసీఎల్​ సీఎండీ ఎల్​.శివశంకర్​, తెలంగాణ తరఫున విద్యుత్​ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్​ మిత్తల్​, టీజీ రెడ్కో వైఎస్​ చైర్మన్​, ఎండీ వి.అనీల అందుకున్నారు. కేంద్ర విద్యుత్​ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్​ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ).. నేషనల్​ ఎనర్జీ కన్జర్వేషన్​ అవార్డ్స్​–2025 పేరుతో ఈ అవార్డులను ఏటా అందజేస్తుంది.

 Read Also: విజన్ సరే… ఇంప్లిమెంటేషన్ ఎలా?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>