కలం, స్పోర్ట్స్: ఈ ఏడాది జపాన్లో జరగబోయే ఆసియన్ గేమ్స్లో పతకం సాధించడమే లక్ష్యంగా షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (Aishwary Pratap Singh Tomar) సిద్ధమవుతున్నారు. ఫామ్ కోల్పోయినా మళ్లీ పుంజుకోగలననే నమ్మకం తనకు ఉందని ఈ రెండు సార్లు ఒలింపియన్ అయిన యువ షూటర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 19 నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్ పెద్దదా, కాదా అని ఆలోచించకుండా, కేవలం తన ప్రాక్టీస్పైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. చదువుపై ఆసక్తి లేక షూటింగ్ వైపు వచ్చిన ఐశ్వరీ ప్రతాప్.. తన అన్న నవదీప్ రాథోడ్ సలహాతో ఈ రంగంలోకి వచ్చారు.
10 మీటర్ల కంటే 50 మీటర్ల రైఫిల్ త్రీ-పొజిషన్స్ ఈవెంట్ చాలా కష్టమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మూడు భిన్నమైన పొజిషన్లలో రాణించడానికి ఎంతో అనుభవం కావాలని వివరించారు. గత టోక్యో, పారిస్ ఒలింపిక్స్తో పాటు ప్రపంచ ఛాంపియన్షిప్ల అనుభవం తనను మరింత మెరుగైన షూటర్గా మార్చిందని ఐశ్వరీ ప్రతాప్ (Aishwary Pratap Singh Tomar) తెలిపారు. ఆసియా ఛాంపియన్షిప్లో గెలిచిన ఐదు బంగారు పతకాలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని చెప్పారు.
ఖేల్ రత్న అవార్డుపై మాట్లాడుతూ.. తాను అర్హుడైతే ఎలాంటి రాజకీయం లేకుండా ఆ పురస్కారం దక్కుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒలింపిక్ ఎంపిక కోసం జాతీయ రైఫిల్ అసోసియేషన్ (NRAI) నిర్వహించే కఠినమైన ట్రయల్స్ విధానాన్ని ఆయన సమర్థించారు. ప్రస్తుత ఫామ్ ఆధారంగానే ఎంపికలు జరగడం సరైనదేనని స్పష్టం చేశారు.
Read Also: బరువు తగ్గాలనుకుంటున్నారా? మధ్యాహ్నం ఈ తప్పులు చేయకండి!
Follow Us On: X(Twitter)

