epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆ భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు : ఆది శ్రీనివాస్

కలం, వెబ్​ డెస్క్​ : బీఆర్ఎస్​ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీకి రావడంపై ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas)​ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ (KCR)​ వస్తున్నారని బీఆర్ఎస్​ నేతలు హడావుడి చేశారని, అయినా కేసీఆర్​ కేవలం సంతకం పెట్టడానికే సభకు వచ్చారని ఎద్దేవా చేశారు.

అనర్హతకు గురి అవుతారనే భయంతోనే కేసీఆర్​ సంతకం పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా సభలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సింది పోయి అలా చేయకుండా కేవలం విధివిధానాలను పాటించడానికే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా వారి తరఫున మాట్లాడకుండా కేసీఆర్​ బాధ్యతను విస్మరించారన్నారు.

అసెంబ్లీ అనేది రాజకీయ డ్రామాలకు వేదిక కాదని ఆది శ్రీనివాస్​ అనారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కేంద్ర బిందువుగా ఉండాలని, అసెంబ్లీలో లోపల రాజకీయాలు చేయకుండా వ్యవహరించాలని సభ్యులకు శ్రీనివాస్ (Aadi Srinivas)​ సూచించారు.

Read Also: అసెంబ్లీ 15 రోజులు నిర్వహించాలి: హరీష్ రావు డిమాండ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>