epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సర్పంచ్​ ఎన్నికల్లో సీఎం తిరగడం చరిత్రలో ఎప్పడూ చూడలేదు : కేటీఆర్​

కలం, వెబ్​ డెస్క్​ : సర్పంచ్ ఎన్నికల (Sarpanch Elections) ప్రచారానికి ముఖ్యమంత్రి తిరగడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు అని రేవంత్​ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ (KTR) వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో పర్యటించిన ఆయన బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన సర్పంచు (BRS Sarpanch)లతో ఆయన మాట్లాడారు. విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) జిల్లాల్లో తిరిగి పరోక్షంగా సర్పంచ్​ ఎన్నికల ప్రచారం చేశాడని విమర్శించారు. కాంగ్రెస్ సర్పంచులను గెలిపించకపోతే ఇండ్లు ఇవ్వం, మెడలు పట్టుకొని తోసేస్తాం అని ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగుతున్నారని కేటీఆర్​ ఆరోపించారు.

“సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ అనే సోదరుడిని కాంగ్రెస్ గుండాలు కిరాతకంగా దాడి చేసి చంపేశారు. తిప్పర్తి మండలంలో బీఆర్​ఎస్​ నుంచి మహిళా అభ్యర్థి సర్పంచుగా నామినేషన్ వేస్తే, కోమటిరెడ్డి అనుచరులు ఆమె భర్తను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఇంకో దగ్గర బీఆర్​ఎస్​ కు ఓట్లు ఎక్కువ పడ్డాయని ఓట్ల స్లిప్పులను తీసుకెళ్లి మోరీలో వేశారు. ఇలా ఎన్నో దౌర్జన్యాలు చేసినా, అధికార పార్టీ దుర్మార్గులను తట్టుకుని రెండు విడతల్లో సత్తా చాటిన గులాబి శ్రేణులకు అభినందనలు” అని కేటీఆర్​ (KTR) ఆరోపణలు చేశారు.

ప్రతి జిల్లాకు ఒక లీగల్​ సెల్​ ఏర్పాటు చేసి గెలిచిన సర్పంచులకు అండగా ఉంటామని కేటీఆర్​ భరోసానిచ్చారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి, ఏదో ఒక కేసులో ఇరికించి బీఆర్​ఎస్​ సర్పంచ్​ లను సస్పెండ్ చేయించే కుట్రలు చేస్తారని, ఎవరికీ భయపడొద్దని భరోసానిచ్చారు. గ్రామాలకు రావాల్సిన డబ్బులను మోడీ, రేవంత్ రెడ్డి ఎవరూ ఆపలేరని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఇంకో రెండున్నర ఏండ్లు పని చేసిన తరువాత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో పనిచేస్తారని సర్పంచులకు మాత్రమే పని చేస్తారు, మళ్లీ మన ప్రభుత్వంలో ఇంకో రెండున్నర ఏండ్లు పనిచేస్తారని కేటీఆర్​ వెల్లడించారు.

Read Also: ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>