కలం, వెబ్డెస్క్: H1B, H4 వీసాదారులకు వెట్టింగ్ (Visa Vetting) ప్రారంభమైంది. దరఖాస్తుదారులు, వారి కుటుంబసభ్యుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఆయా ఖాతాల ఐదేళ్ల డేటాను వారు సేకరిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డిన్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో H1B, H4 వీసాదారులు, వారి కుటుంబసభ్యుల పోస్టులు, షేర్లు, కామెంట్లను ఎంబసీ ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తోంది. అంతేకాదు, కొత్తగా ఈ వెట్టింగ్ను జె,ఎఫ్, ఎమ్ కేటగిరీ వీసాలకు విస్తరించింది. కాగా, ఈ వెట్టింగ్ ప్రక్రియ కారణంగానే నేటి నుంచి (డిసెంబర్ 15) నుంచి జరగాల్సిన చాలా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి.
వీటిలో అధికభాగం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్కు వాయిదా వేశారు. దీంతో స్టాంపింగ్, ఇతర కార్యక్రమాలకు వచ్చి భారత్లోనే చాలా మంది H1B వీసాదారులు చిక్కుకుపోయారు. వీళ్లంతా తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతుండడంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అలాటర్నీ అండ్ అడ్వొకేట్ ఎలెన్ ఫ్రీమన్.. కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, లేదా నెక్ట్స్ ఇంటర్వ్యూ వరకు సుదీర్ఘ సెలవు ఇవ్వాలని కోరారు. కాగా, అక్రమవలసలను అడ్డుకునేందుకంటూ ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త నిబంధన డాలర్ డ్రీమ్స్కు శరాఘాతమే. ఏటా అమెరికా జారీ చేసే హెచ్1బీ వీసాల్లో దాదాపు సగానికిపైగా భారత్కే వస్తున్నాయి. ఫీజు పెంపు, వెట్టింగ్ (Visa Vetting) నిబంధనలు తదితర వాటివల్ల ఇప్పుడు వీటిలో కోత పడనుంది. ప్రస్తుతం అమెరికాలో భారత్ నుంచి 3లక్షల మందికిపైగా H1B వీసాదారులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Read Also: కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన తిలక్ వర్మ
Follow Us On: Instagram


