epaper
Monday, January 26, 2026
spot_img
epaper

అభిషేక్ వీర విహారం.. సిరీస్​ భారత్​దే

కలం, వెబ్​డెస్క్​: వారెవ్వా టీమిండియా. ధనాధన్ ఆటతో 153 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఉఫ్​ మంటూ ఊదేసింది. మరో రెండు మ్యాచ్​లు మిగిలి ఉండగానే సిరీస్​ సొంతం చేసుకుంది. ఓపెనర్​ అభిషేక్​ శర్మ (Abhishek Sharma) వీర విహారాని (68 నాటౌట్​: 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్​లు) కి తోడు కెప్టెన్​ సూర్య కుమార్​ యాదవ్​ (57 నాటౌట్​; 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్​లు) చెలరేగడంతో కివీస్​తో మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

గువాహటిలోని (Guwahati) బర్సాపోరా మైదానం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన న్యూజిలాండ్​ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. గ్లెన్​ ఫిలిప్స్​(48; 40 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్​) టాప్​ స్కోరర్​. మార్క్​ చాప్​మన్​(32), మిచెల్​ శాంట్నర్​(27) ఓ మోస్తరు పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్​ బుమ్రా 3, రవి బిష్ణోయ్​, హార్థిక్​ పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. హర్షిత్​ రాణాకు 1 వికెట్​ దక్కింది.

ఛేదనలో భారత్​కు ఆరంభంలోనే షాక్​ తగిలింది. ఇన్నింగ్స్​ మొదటి బంతికే సంజూ శాంసన్​(0) గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇషాన్​ కిషన్​ 28 (13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్​లు) పరుగులు చేసి అవుట్​ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా లెక్కచేయకుండా అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఫోర్లు, సిక్స్​లతో చెలరేగాడు. ఈ క్రమంలో 14 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కెప్టెన్​ సూర్య కుమార్​ సైతం బాదుడు మొదలెట్టాడు. 25 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బంతికే ఫోర్​ బాది జట్టుకు గెలుపు అందించాడు.

ఈ క్రమంలో భారత్​ కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించడం విశేషం. న్యూజిలాండ్​ బౌలర్లలో మ్యాట్​ హెన్రీ, ఇష్​ సోధి చెరో వికెట్​ తీశారు. ఈ విజయంతో భారత్​ ఐదు టీ20ల సిరీస్​ను మరో రెండు మ్యాచ్​లు ఉండగానే 3‌‌–0తో గెల్చుకుంది. నాలుగో టీ20 విశాఖపట్నంలో ఈ నెల 28న జరుగుతుంది.

Read Also: ఐసీసీ వార్నింగ్​.. టీమ్ ను ప్రకటించిన పాకిస్తాన్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>