కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ( ISS Evacuation) కారణంగా నలుగురు వ్యోమగాములు హుటాహుటిన భూమికి తిరుగుపయనమయ్యారు. నాసా కూ-11 డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ‘ఎండీవర్’ ద్వారా వీరు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర తీరంలో సురక్షితంగా దిగారు. ఓ వ్యోమగామి అనారోగ్యం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మిషన్ ను వాయిదా వేస్తున్నట్లు నాసా ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన నలుగురు వ్యోమగాములు ఈరోజు భూమిపైకి చేరారు. సముద్ర జలాల్లో డ్రాగన్ క్యాప్సూల్ పారాచూట్ల సాయంతో దిగగానే రికవరీ బృందం వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీశారు.
Read Also: టూ వీలర్ ప్రమాదాల్లో 3.35లక్షల మంది మృతి : గడ్కరీ
Follow Us On : WhatsApp


