మంచిర్యాలలో విషాదం.. టీవీ చూడొద్దన్నందుకు యువతి సూసైడ్!

కలం, వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే యువత సూసైడ్ దాకా వెళుతున్నారు. చిన్న చిన్న గొడవలకే భావోద్వేగాలు నియంత్రించుకోలేక పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీవీ చూడొద్దని తల్లి మందలించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన మోత్కూరి అక్షయ(19)ను టీవీ చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్షయ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>