మడికొండ చౌరస్తాలో ఉద్రిక్తత.. యువకుడు ఆత్మహత్యాయత్నం

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్(Warangal) జిల్లా మడికొండ చౌరస్తా(Madikonda Chowrasta) లో చెత్త డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని స్థానికులు చేపట్టిన నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో పండుగ రాజ్‌కుమార్ అనే యువకుడు తన ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అడ్డుకుని అతడిని అక్కడి నుంచి తరలించారు. గత 15 ఏళ్లుగా మడికొండ చౌరస్తాలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ (Dumping Yard) కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>