నదిపై ప్రమాదకర ప్రయాణం.. పట్టు తప్పితే ప్రాణాలు గోవిందా!

కలం, వెబ్ డెస్క్: అరుణాచల్ ప్రదేశ్‌లోని (Arunachal Pradesh) అంజావ్ జిల్లాలో మహిళలు నిత్యం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రాకపోకల కోసం సరైన వంతెన లేకపోవడంతో ఉక్కు తీగను పట్టుకుని నదిని దాటుతున్నారు. దేశం వేగవంతమైన అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని చెప్పుకుంటున్నా.. ఆ ప్రాంతంలో ఇప్పటికీ వంతెన లేకపోవడం వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. అత్యవసర అవసరాలు, ఉపాధి, విద్య, వైద్య సేవల కోసం నదిని దాటే ప్రతి సందర్భంలో వారి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ పరిస్థితిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శాశ్వత వంతెన నిర్మించి ప్రజల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read Also: అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్‌కి రిస్క్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>