కలం, ఖమ్మం బ్యూరో : అప్పుల బాధ తాళలేక ఓ మహిళ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్ళపల్లి (Allapalli) మండలంలో చోటు చేసుకుంది. స్వరూప అనే వివాహిత అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు.అనంతరం మెరుగైన చికిత్స అందించడం కోసం కొత్తగూడెంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, బుధవారం తెలంగాణలో పారక్వైట్ గడ్డి మందు అమ్మకాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

