కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం జిల్లాలోని నడుపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Nadupuru Govt School) విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో సరికొత్త రికార్డులు సృష్టించారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా రాణించిన వీరు తమ పాఠశాల కీర్తిని దశదిశలా చాటారు. ఒక విద్యార్థి ఏకంగా 592 మార్కులు సాధించి జిల్లాలోనే టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. పదుల సంఖ్యలో విద్యార్థులు 500 మార్కులకు పైగా స్కోరు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ అపూర్వ విజయం సందర్భంగా నడుపూరు వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో విద్యార్థులను అభినందిస్తూ ఉపాధ్యాయులు స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ఈ ఫలితాలే నిదర్శనమని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషి తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల ప్రాధాన్యతను వివరిస్తూ ఈ గెలుపును ఒక ఉత్సవంలా మార్చారు.

