కలం, వెబ్ డెస్క్ : సర్వోదయ తెలంగాణ సాధించడమే తమ లక్ష్యం అని ‘తెలంగాణ రక్షణ సేన’ (Telangana Rakshana Sena) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. శనివారం సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో మీట్ ది ప్రెస్ పేరుతో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల ముందుకు వచ్చామని టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా పోరాడుతుందని.. జాగృతి ఎన్జీవో గా మారుతుందని తెలిపారు. తెలంగాణ సాధన కోసం బయటకు వచ్చినప్పుడు కూడా ప్రజలు వెలుగులో ఉండాలని పోరాడమన్నారు.

