కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) గురువారం రాజ్యసభ (Rajya Sabha) సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లోని ఉపరాష్ట్రపతి ఛాంబర్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దల సభలో గళం విప్పుతానని ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి అన్నారు.

