కలం, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ (Maripeda) మండలంలో తీవ్ర కలకలం రేగింది. మండల పరిధిలోని భూక్యా తండా గ్రామపంచాయతీలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను మాలోత్ శారద, మాలోతు నీలాగా గుర్తించారు. మంగళవారం రాత్రి వీరిద్దరూ మద్యం సేవించిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక తండావాసులు పేర్కొంటున్నారు. అయితే, ప్రస్తుత ఎండ తీవ్రత కారణంగా వీరు వడదెబ్బకు గురై చనిపోయారా, లేక మరేదైనా ఇతర బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

