కలం, వెబ్ డెస్క్ : బండి భగీరథ్ పోక్సో కేసు అంశం తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో పరారీలో ఉన్న బండి భగీరథ్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) లేఖ రాశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కేబినెట్ నుంచి తప్పించాలని లేఖలో కోరారు. కేంద్ర మంత్రి తనయుడిపై పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో విచారణ నిష్పాక్షికంగా జరగడానికి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని లేఖలో డిమాండ్ చేశారు.

