కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆదివారం ఘోర ప్రమాదం (Khammam Accident) జరిగింది. ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి (Three Dead) చెందారు. కొనిజర్ల వద్ద తెల్లవారుజామున లారీ, కారు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం జరగటానికి గల పూర్తి వివరాలు తెలియరాలేదు.

