కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitharama Raju District)లో ఘోర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పెదబయలు మండలం మత్స్యగడ్డలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. చెరువులో చేపలు పట్టేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో మృతి చెందారు. మృతులు గల్లంగి హర్షిత్, కోడా ప్రదీప్, పాంగి బబ్లూగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: మృణాల్ పెళ్లిపై అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!
Follow Us On : WhatsApp

