epaper
Tuesday, November 18, 2025
epaper

రైతుల కోసం పోరాటానికి రెడీ అంటున్న కాజల్..

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కాజల్(Kajal Aggarwal) కూడా ఒకరు. పెళ్ళి తర్వాత అమ్మడి స్పీడ్ కాస్తంత తగ్గింది కానీ.. అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటోంది. తాజాగా హీరోయిన్ నుంచి లాయర్‌గా కొత్త అవతారం ఎత్తింది ఈ పంచదారబొమ్మ. తెలుగు, తమిళం, హిందీ సహా పలు ఇతర భాషల్లో కూడా వరుస ప్రాజెక్ట్‌లతో అదరగొట్టిన కాజల్.. ఇటీవల కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు రీఎంట్రీని స్ట్రాంగ్‌గా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే ‘ది ఇండియా స్టోరీ(The India Storry)’ అనే మూవీ చేస్తోంది. ఈ మూవీలో శ్రేయాస్ తాల్పడే కీలక పాత్ర పోషిస్తున్నారు. చేతన్ డీకే(Chetan DK) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయింది. తాజా తన రీఎంట్రీని ఫిక్స్ చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది కాజల్.

ఈ సినిమా అంతా కూడా వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతులకు పురుగు మందు వ్యాపారుల కుంభకోణాల మధ్య కొనసాగుతుంది. రైతులను ఎలా మోసంచేస్తున్నారు? అనేదే మెయిన్ థీమ్. ఇందులో రైతుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది పాత్రలో కాజల్(Kajal Aggarwal) కనిపించనుంది. ఈ మూవీ ద్వారా వ్యవసాయం, న్యాయం, రైతుల సమ్యలపై సామాజిక చైతన్యం తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తోంది.

Read Also: రష్మిక స్పీడుకు రుక్మిణి బ్రేకులు వేస్తోందా..?
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>