epaper
Tuesday, November 18, 2025
epaper

రియాజ్ ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంఘం కేసు

రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌(Riyaz Encounter)పై తెలంగాణ మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. సోమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసుకున్నట్లు మానవ హక్కుల సంఘం ప్రకటించింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను నవంబర్ 24లోపు అందించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించింది మానవ హక్కుల సంఘం.

Riyaz Encounter | చికిత్స పొందుతున్న రియాజ్ బాత్రూంకి అని చెప్పి లేచాడు. అదే సమయంలో అక్కడ సెక్యూరిటీగా ఉన్న కానిస్టేబుళ్లపై దాడి చేసి వారి దగ్గర ఉన్న గన్‌ను లాక్కున్నాడు. ఈ ఘర్షణలో ఓ కానిస్టుబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందకు రియాజ్ ప్రయత్నించాడు. అప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాడు. ఈ ఘటన జీజీహెచ్‌లో చోటు చేసుకోగా.. రియాజ్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు పోలీసులు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగింది.

Read Also: జూబ్లీహిల్స్ ప్రచారంలో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>