కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలపై అధికారిక స్పష్టత వచ్చింది. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 మార్చి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (TG Inter Results) రేపు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారుడు కే. కేశవ రావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సంయుక్తంగా విడుదల చేయనున్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం (జనరల్, వొకేషనల్) పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తు దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా మారనున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
ఫలితాలు (TG Inter Results) చూసే వెబ్సైట్లు:
tgbie.cgg.gov.in
results.cgg.gov.in
అలాగే, ఫలితాలను మీడియా సంస్థలకు కూడా విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
Read Also: ఐలాపూర్ భూములు.. అంతులేని వివాదాలు
Follow Us On : WhatsApp

