కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ఏర్పాటు చేసిన బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరణకు సిద్ధం చేసిన విగ్రహం (Ambedkar) ధ్వంసం కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: క్యాబినెట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంటి?: జగ్గారెడ్డి
Follow Us On : WhatsApp

