Mobile Popup Ad
Mobile Popup Ad

గ్రౌండ్‌లో గడ్డి పొడుగుపై బార్సిలోనా కోచ్ కంప్లయింట్

కలం, వెబ్ డెస్క్ :  అట్లెటికో మాడ్రిడ్‌తో జరగనున్న రెండో లెగ్ మ్యాచ్ బార్సిలోనాకు అత్యంత కీలకంగా మారింది.  ఇప్పటికే రెండు గోల్స్ వెనుకబడి ఉన్న బార్సిలోనాకు ఈ మ్యాచ్ గెలవడం సవాల్‌గా నిలిచింది. ఈ కీలక పోరుకు ముందు బార్సిలోనా హెడ్ కోచ్ హాన్సీ ఫ్లిక్ (Hansi Flick) రియాద్ ఎయిర్ మెట్రోపాలిటానో స్టేడియం పిచ్ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యంగా మైదానంలోని గడ్డి ఎక్కువ పొడవుగా ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ యూఈఎఫ్ఏ (UEFA) అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మైదానంలోని ఒక భాగాన్ని చూపిస్తూ గడ్డి పొడవు ఎక్కువగా ఉండటం వల్ల బంతి వేగం తగ్గే ప్రమాదం ఉందని ఫ్లిక్ (Hansi Flick) తెలిపారు. వేగవంతమైన పాసింగ్ గేమ్‌కు ప్రసిద్ధి చెందిన బార్సిలోనాకు ఇది ఆటంకంగా మారుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన వివాదంగా కాకుండా, మర్యాదపూర్వకంగా అధికారులకు వివరించారు.

ఇదిలా ఉండగా, డీగో సిమియోన్ నేతృత్వంలోని అట్లెటికో మాడ్రిడ్ తమ సొంత మైదానంలో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తుందని బార్సిలోనా ముందుగానే అంచనా వేసింది. తొలి లెగ్ తర్వాతే రెండో లెగ్ కఠినంగా ఉంటుందని జట్టుకు స్పష్టమైంది. ఇప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ అట్లెటికోను వారి సొంత గడ్డపై ఓడించి అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వాల్సిన బాధ్యత బార్సిలోనా ఆటగాళ్లపై ఉంది. మైదాన పరిస్థితులు ఎలా ఉన్నా విజయం సాధించడమే లక్ష్యంగా జట్టు సిద్ధమవుతోంది.

Read Also: ఎల్పీజీ కొరత‌.. మార్కెట్ లోకి డీజిల్ స్టవ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>