epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘మున్సిపల్’ ఓటర్ల తుది జాబితా 12న

కలం, వెబ్​డెస్క్​: తెలంగాణలో మున్సిపల్​ ఎన్నికల (Municipal Elections) కు తుది జాబితా ఈ నెల 12న విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ప్రకటించింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు/మున్సిపల్​ కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతపై స్టేట్​ ఎలక్షన్​ కమిషన్ బుధవారం ​వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్లకు పలు సూచనలు, సలహాలు చేసింది. ఆ వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రకారం.. వార్డు వారీ ఓటర్ల తుది జాబితా ఈ నెల 12న విడుదల చేయాలి. అలాగే 13న పోలింగ్​ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా వెల్లడించి, టీ–పోల్​లో అప్​లోడ్​ చేయాలి. 16న​ ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను పోలింగ్​ స్టేషన్ల వారీ ప్రచురించాలి.

పోలింగ్​కు అవసరమయ్యే బ్యాలెట్​ బాక్సులు అంచనా సిద్ధం చేయాలి. ఆర్​వో(రిటర్నింగ్​ ఆఫీసర్స్​)లు, సహాయ​ ఆరోవోలు, జోనల్​ ఆఫీసర్లు నియామకం త్వరగా పూర్తిచేయాలి. ఎఫ్ఎస్​టీ, ఎస్​ఎస్​టీ బృందాల నియామకమూ పూర్తిచేయాలి. పోలింగ్​ సిబ్బంది నియామకం కోసం ఎంపిక చేసిన ఉద్యోగుల వివరాలను టీ–పోల్​​లో అప్​లోడ్​ చేయాలి. మున్సిపల్​ ఎన్నికల (Municipal Elections)ను అత్యంత పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Read Also: వెండికి కూడా హాల్ మార్కింగ్..! కేంద్రం నయా ప్లాన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>