epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

చేవెళ్ల బస్సు ప్రమాదంపై సుమోటోగా కేసు నమోదు చేసిన మానవహక్కుల కమిషన్

చేవెళ్ల(Chevella) వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(Telangana HRC) సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 15వ తేదీ ఉదయం 11 గంటలలోపు పూర్తి నివేదికను సమర్పించాలని రవాణా శాఖ, హోం శాఖ, గనులు, భూగర్భశాస్త్ర శాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను కమిషన్ ఆదేశించింది.

అసలు కారణాలు ఏమిటి?

ప్రమాదానికి దారితీసిన కారణాలు, రహదారి భద్రతా ప్రమాణాల లోపాలు, వాహన సాంకేతిక లోపాలు, డ్రైవర్ తప్పిదం వంటి అంశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని సూచించింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలన్నదీ కమిషన్(Telangana HRC) స్పష్టం చేసింది. చేవెళ్లలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సంఘటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవగా, ప్రభుత్వం కూడా ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి సమయంలో మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడం ద్వారా బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.

Read Also: మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం స్వాధీనం .. భద్రతా బలగాల భారీ ఆపరేషన్

Follow Us On : Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>