కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రం సేలం పట్టణంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Salem Bus Accident) జరిగింది. వేగంగా వస్తున్న ప్రభుత్వ బస్సు వాహనాలపైకి దూసుకెళ్లింది. మినీ వ్యాన్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టగా, ఆ వెనకే మరో బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 నెలల చిన్నారి సహా 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: బడ్జెట్లో చేనేత రంగానికి రూ.258 కోట్లు: భట్టి
Follow Us On : WhatsApp

