కలం, వెబ్ డెస్క్ : నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ (CM Stalin) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే.. తమిళనాడులో భారీ ఉద్యమం చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు చూడని ఉద్యమాన్ని చూపెడుతానని స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో కలిసి రోడ్డుపై భైఠాయిస్తానని చెప్పారు. అంబేద్కర్ పై ప్రమాణం చేసి చెబుతున్నానని.. ఉద్యమం తీవ్రంగా ఉంటుందన్నారు. 1960 నాటి డీఎంకేను చూపెడుస్తానని.. ఇదే తన చివరి హెచ్చరిక అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: చీరలో డాన్స్ చేస్తే తప్పా..? యువతి కన్నీరు !
Follow Us On: X(Twitter)

