కలం, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో తీవ్ర పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో టీవీకే పార్టీ తమిళనాడు ఫలితాల్లో దూసుకుపోతోంది. అధికార డీఎంకేను వెనక్కి నెట్టి విజిల్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. టీవీకే పార్టీ అధికారం చేపట్టబోతుందనే అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నటి త్రిష (Trisha) విజయ్ (Vijay) ఇంటికి చేరుకున్నారు.
ఆమె పుట్టిన రోజుతో పాటు ఫలితాలు ఒకే రోజు కావడంతో త్రిష (Trisha) తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి నుంచి నేరుగా విజయ్ (Vijay) ఇంటికి వెళ్లారు. అంతకుముందే విజయ్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు విజయ్ అభిమానులతో పాటు, టీవీకే కార్యకర్తలు దళపతి ఇంటివద్దకు భారీగా చేరుకుంటున్నారు.
విజయ్ దళపతి నివాసానికి నటి త్రిష!
Trisha reaches Vijay home amidst election results#ThalapathyVijay #Trisha #jananayagan #TrishaBirthday #VijayTrisha #TVKparty #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/2NyWQhIV9g— Kalam Daily (@kalamtelugu) May 4, 2026
Read Also: తారుమారైన ఐదు రాష్ట్రాల ఫలితాలు.. కేసీఆర్పై భారీగా ట్రోల్స్!
Follow Us On : WhatsApp

