బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: సభా కార్యకలాపాలకు అంతరాయం కల్గిస్తున్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను (BRS MLAs) సభ నుంచి రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నిర్ణయం తీసుకున్నారు. సభ ఆదివారం ఉదయం ప్రారంభమైనప్పటి నుంచీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. సీనియర్ సభ్యుల పట్ల అవమానకరమైన తీరులో వ్యవహరిస్తున్నారని పలువురు సభ్యులు లేవనెత్తిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రతిపాదించిన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం లభించడంతో  ఈ సెషన్ ముగిసేంత వరకు రెండు రోజుల పాటు సభకు హాజరు కాకుండా సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను (BRS MLAs) స్పీకర్ సస్పెండ్ చేశారు.

1. సబితా ఇంద్రారెడ్డి
2. అనిల్ జాదవ్
3. హరీశ్‌రావు
4. జగదీశ్‌రెడ్డి
5. గంగుల కమలాకర్
6. పాడి కౌశిక్ రెడ్డి
7. మాధవరం కృష్ణారావు
8. బండారు లక్ష్మారెడ్డి
9. కోవా లక్ష్మి
10. మహిపాల్ రెడ్డి
11. మాణిక్ రావు
12. పద్మారావు
13. చింతా ప్రభాకర్
14. కొత్త ప్రభాకర్ రెడ్డి
15. ప్రశాంత్ రెడ్డి
16. మర్రి రాజశేఖర్ రెడ్డి
17. పల్లా రాజేశ్వర్ రెడ్డి
18. కల్వకుంట్ల సంజయ్
19. తలసాని శ్రీనివాస్ యాదవ్
20. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
21. కాలేరు వెంకటేశ్
22. విజయుడు
23. కేపీ వివేకానంద్
24. కేటీఆర్

Read Also: సిగ్గుంటే కేసీఆర్‌ చేత రాజీనామా చేయించాలి: సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>