కలం, వెబ్ డెస్క్: అయిదో రోజు ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) సభలో కీలక ప్రకటన చేశారు. సభలో ఆడియో సిస్టంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, నిపుణుల బృందం రాత్రంతా సమస్య పరిష్కారానికి ప్రయత్నించారని వెల్లడించారు. ఇప్పుడు ముంబై నుంచి టెక్నీషియన్లు వస్తున్నారని తెలిపారు. సభ్యులు తమ మైక్ దగ్గర ఉన్న ఆన్, ఆఫ్ బటన్ ఉపయోగించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు కార్డ్ లెస్ మైకులు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ఒక్క రోజు సభ్యులు సహకరించాలని కోరారు.


