Mobile Popup Ad
Mobile Popup Ad

స్మృతి మందాన.. చేసింది తక్కువ స్కోరే అయినా రికార్డ్..!

టీమిండియా మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మందానా(Smriti Mandhana) సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. విశాఖపట్నం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లోనే ఈ రికార్డ్ సాధించింది భారత ఓపెనర్. వర్షం కారణంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కాస్తంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఇందులో టాస్ గెలిచి భారత్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చిన స్మృతి.. 23 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది. చేసింది తక్కువ స్కోరే అయినా ఆమె ఓ రికార్డ్ నమోదు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 23 పరుగులకే ఔట్ అయిన స్మృతి.. మహిళల వన్డే క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలచింది. మొత్తం 17 ఇన్నింగ్స్ ఆడి 982 పరుగులు చేయడంతో స్మృతి ఈ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీరే..

Smriti Mandhana (భారత్) – 982 (2025)

బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) – 970 (1997)

లారా వోల్వార్డ్ట్ (సౌతాఫ్రికా)- 882 (2022)

డెబ్బీ హాక్లీ (న్యూజిలాండ్) – 880 (1997)

అమీ సాటర్త్‌వైట్ (న్యూజిలాండ్) – 853 (2016)

Read Also: మూవీ ప్రమోషన్‌కి రూ.15 లక్షలు.. తప్పేమీ కాదన్న నిహారిక

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>