epaper
Monday, January 19, 2026
spot_img
epaper

ఫోన్​ ట్యాపింగ్ కేసులో హరీశ్​రావుకు సిట్​ నోటీసులు

కలం, వెబ్​ డెస్క్​ : తెలుగు రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్​ఎస్​ మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao)కు సిట్​ నోటీసులు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్​ స్టేషన్​ కు రావాలని సిట్ ఆదేశించింది. ఓ ప్రైవేట్​ మీడియా ఛానల్​ ఎండీ స్టేట్​ మెంట్​ మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హరీశ్​ రావు ఇంట్లో లేని సమయంలో సిట్​ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే, హరీశ్​ రావు విచారణకు హాజరవుతారా? లేదా చూడాలి. సిట్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించే అవకాశం ఉంది. దీనిపై బీఆర్​ఎస్​ నేతలు, శ్రేణులు ఎలా స్పందిస్తారో ఉత్కంఠగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>