epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘SIR’ ఎఫెక్ట్​.. అస్సాంలో 10.5 లక్షల ఓట్లు డిలీట్

కలం, వెబ్​ డెస్క్​ : Assam SIR | పట్టణీకరణ, ఉపాధి కోసం ప్రజలు తరచుగా వలస వెళ్లడం, విదేశీ అక్రమ వలసదారు పేర్లు ఓటరు జాబితాలో చేర్చడం వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఎస్​ఐఆర్​ (ప్రత్యేక సమగ్ర సవరణ) నిర్వహణకు శ్రీకారం చుట్టుంది. మొదటి విడుతలో బీహార్ లో​ సర్​ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు రెండో దశలో 12 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్పెషల్​ ఇటెన్సివ్ రివిజన్​ కొనసాగుతోంది.

అస్సాంలో స్పెషల్​ ఇంటెన్సివ్ రివిజన్​ (Assam SIR) ప్రక్రియ పూర్తయిన తరువాత ఈసీ ఎలక్ట్రోరల్​ రోల్​ ను శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,51,09,754 మంది ఓటర్లు ఉన్నారు. మరో 93,021 మంది డౌట్​ పూల్​ ఓటర్లు ఉన్నట్లు డ్రాఫ్ట్​ లో పేర్కొంది. అయితే, చనిపోయిన వాళ్లు, వలసదారులు, నకిలీ ఓటర్లు ఇలా మొత్తం 10,56,291 మంది పేర్లను ఈసీ ఎలక్ట్రోరల్​ జాబితా నుంచి తొలగించింది. కాగా, మరో 6 నెలల్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Read Also: గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం: డిప్యూటీ సీఎం భట్టి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>