epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రోడ్డుపై వెండి ఆభరణాలు.. ఎగబడ్డ జనం వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​ : ఉత్తరప్రదేశ్​లోని హాపూర్​ జిల్లా జాతీయ రహదారిపై అపూర్వ ఘటన చోటు చేసుకుంది. వెండి ఆభరణాల (Silver Ornaments) ను తరలిస్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న అభరణాలు రోడ్డుపై పడడంతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారి ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది.

సమాచారం తెలుసుకున్న వెంటనే రహదారిపై పెద్ద ఎత్తున జనం గుమిగూడి.. చెల్లాచెదురుగా పడిన ఆభరణాల (Silver Ornaments) ను ఏరుకున్నారు. వాహనాలను ఆపడంతో ఆ మార్గం మొత్తం ట్రాఫిక్​ జామ్​ అయింది. సంఘటనా స్థలంలో పోలీసులు లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్లుగా మారింది. ఆభరణాలకోసం జనం పోటీపడడంతో తొక్కిసలాట జరిగింది.

కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వెండి ధరలు భారగా పెరుగుతున్నాయి. అమెరికా – వెనెజువెలా మధ్య కొనసాగుతున్న రాజకీ, ఆర్థిక సంక్షోభంతో వెండి, బంగారం రేట్లు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోమవారం భారత మార్కెట్​ లో కిలో వెండి రూ. 2,43,000 చేరింది.

Read Also: వచ్చే వారం భారత్​కు జర్మనీ​ ఛాన్సలర్​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>