epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ద మంత్​.. షెఫాలీ, హార్మర్​

కలం, వెబ్​డెస్క్​: భారత మహిళల జట్టు డాషింగ్​ ఓపెనర్​ షెఫాలీ వర్మ (Shafali Verma) ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​గా ఎంపికైంది. ఈ ఏడాది నవంబర్​ నెలకు గాను ఈ అవార్డుకు షెఫాలీని ఐసీసీ(ICC) ఎంపిక చేసింది. మహిళల ప్రపంచ కప్​ గెలవాలన్న భారత జట్టు కల ఈ ఏడాదిలో నెరవేరిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో షెఫాలీ కీలక పాత్ర పోషించింది. మరో ఓపెనర్​ ప్రతీకా రావల్​ గాయపడడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షెఫాలీ సెమీస్​, ఫైనల్లో ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో షెఫాలీ బ్యాటింగ్​లో దూకుడుగా ఆడి 78 బంతుల్లో 87 పరుగులు చేసింది. జట్టు తరఫున టాప్​ స్కోరర్​గా నిలిచింది. అలాగే బౌలింగ్​లో ఏడు ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టింది. ఈ ఆల్​రౌండ్​ ప్రదర్శనకు గాను షెఫాలీకి ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

కాగా, ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ద మంత్​ అవార్డు దక్కడంపై షెఫాలీ వర్మ (Shafali Verma) సంతోషం వ్యక్తం చేసింది. భారత జట్టు సుదీర్ఘ కలను నెరవేర్చడంలో తాను భాగం అయినందుకు హ్యాపీగా ఉన్నట్లు తెలిపింది. తన ప్రయాణానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు పేర్కొంది. కాగా, పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్​ సైమన్​ హార్మర్​(Simon Harmer)ను ‘ప్లేయర్​ ఆఫ్​ ద మంత్​’ వరించింది. భారత్​తో జరిగిన రెండు మ్యాచ్​ల సిరీస్​లో హార్మర్​ 17 వికెట్లు పడగొట్టి ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్​గా నిలిచాడు. తమ జట్టు క్లీన్​స్వీప్​ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

Read Also: కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన తిలక్ వర్మ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>