గురుకుల పాఠశాలలో ర్యాగింగ్​ కలకలం.. 9వ తరగతి విద్యార్థిపై దాడి

కలం, వెబ్​ డెస్క్​ : ర్యాగింగ్​ భూతం కాలేజీల నుంచి పాఠశాలలకు వ్యాపించింది. స్నేహ భావంతో ఉండాల్సిన సహచరుల మధ్య చిచ్చు పెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) మైనారిటీ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడి చేశారు. తాము చెప్పిన పనులు చేయడం లేదంటూ ర్యాగింగ్​ చేశారు. ఈ దాడిలో విద్యార్థి తలతో పాటు చేయికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

Read Also: ప్రేమ ఒక్కసారేనా.. మళ్లీ మళ్లీ కలగదా?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>