కలం, వెబ్డెస్క్: భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ను కలసింది. బుధవారం ముంబైలోని ఎంఐజీ క్రికెట్ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వాళ్లను కలిశారు. ఇటీవలే భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో సచిన్ మాట్లాడారు. వారితో ఫొటోలు దిగారు. ఎన్నో అవరోధాలు దాటుకుంటూ కలలను సాకారం చేసుకున్నారని వారిని అభినందించారు.
కృషి, పట్టుదల, సాధన జట్టును ఈ స్థాయికి చేర్చిందని ప్రశంసించారు. కెప్టెన్ దీపిక(Deepika) మాట్లాడుతూ సచిన్(Sachin) లాంటి క్రికెట్ దిగ్గజాన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆటపై ప్రేమతో, నమ్మకంతో ఆడామని, మా ప్రతిభను గుర్తిస్తూ సచిన్ లాంటి గొప్ప వ్యక్తి ప్రశంసించడం మరచిపోలేనిదని అన్నారు. ఆయన మనస్సులోంచి వచ్చిన మాటలు తాము చిరకాలం గుర్తుంచుకుంటామని, భవిష్యత్తులో మరింత రాణిస్తామని దీపిక చెప్పింది.
Read Also: హాస్పిటల్లో అడ్మిట్ అయిన జైస్వాల్
Follow Us On: Pinterest


