ప‌ల్నాడులో స్కూటీ డిక్కీలో రూ.5 ల‌క్ష‌లు చోరీ.. వీడియో వైర‌ల్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ప‌ల్నాడు (Palnadu) జిల్లాలో ఓ ఘ‌రానా మోసగాడు చోరీకి పాల్ప‌డ్డాడు. ఓ రైతు అప్పుగా తెచ్చుకున్న డ‌బ్బును చాక‌చ‌క్యంగా దొంగిలించాడు. అయితే ఈ దొంగ‌త‌నం తంతు సీసీ కెమెరాలో రికార్డు అవుతుంద‌న్న‌ది గ‌మ‌నించ‌లేక‌పోయాడు. ఇప్పుడు ఆ చోరీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌ల్నాడు జిల్లాకు చెందిన రైతు వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ త‌న అవ‌స‌రాల నిమిత్తం తెలిసిన వ్య‌క్తి ద‌గ్గ‌ర‌ రూ.5 ల‌క్ష‌లు అప్పుగా తెచ్చుకున్నాడు. డ‌బ్బును త‌న స్కూటీ డిక్కీలో పెట్టుకొని జొన్న‌ల‌గ‌డ్డ బైపాస్‌లో ఉల్లిపాయ‌లు కొనేందుకు ఓ దుకాణానికి వెళ్లాడు. వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ‌ను ముందు నుంచి గ‌మ‌నిస్తున్న ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి స్కూటీ డిక్కీ తెరిచి నగదు దోచుకెళ్లాడు. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చోరీని గుర్తించిన రైతు స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read Also: ఎన్నాళ్లీ ‘డోలీ’ మోతలు.. ఏపీలో మారని గిరిజన బతుకులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>