కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో కల్తీ దందా భారీ స్థాయిలో జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య వేల కిలోల కల్తీ సరుకు దొరుకుతోంది. తాజాగా మూసాపేట పరిధిలోని సనత్ నగర్ లో (Sanath Nagar) ఏకంగా 352 కిలోల కుళ్లిపోయిన చికెన్ ను పట్టుకున్నారు అధికారులు. సూరజ్ పాల్ (66) అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో చాలా రోజుల నుంచి నిల్వ ఉంచిన చికెన్ ను అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. కల్తీ చికెన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చికెన్ ను కస్టమర్లకు, హోటళ్లకు, పర్మిట్ రూంలకు అమ్ముతున్నట్టు అధికారులు తెలిపారు.

