epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర!.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

కలం, వెబ్​ డెస్క్​ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ పథకాన్ని అణచివేయడం ద్వారా పేదల బతుకుదెరువును మోదీ సర్కార్ దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పేదల పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఉపాధి హామీ పథకం యొక్క ప్రాముఖ్యతను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశంలోని దాదాపు 80 శాతం మంది ప్రజలు ఈ పథకంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, భూమి లేని నిరుపేదలకు ఆహార భద్రత కల్పించాలనే గొప్ప ఆశయంతో కాంగ్రెస్ పార్టీ దీనిని తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇంతటి మహోన్నతమైన పథకాన్ని క్రమంగా అణచివేయడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా గ్రామీణ పేదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై కూడా రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయబోతుందని, ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆశించిన స్థాయిలో మెజారిటీ రాకపోవడం వల్లే రాజ్యాంగాన్ని మార్చలేకపోయారని, కానీ వేరే రూపాల్లో ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులను హరించేందుకు కేంద్రం అడ్డదారులను వెతుకుతోందని దుయ్యబట్టారు.

ప్రజల ఓటు హక్కును హరించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే SIR వంటి కొత్త విధానాలను తీసుకువచ్చి, కోట్లాది మంది నిరుపేదలను ఈ దేశ పౌరులే కాదని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. పేదల హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని, కేంద్రం చేస్తున్న ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>