కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయిన సమయంలో, జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ (Venky Mysore) మధ్య జరిగిన చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ఆగిన సమయంలో ఇద్దరూ తీవ్రంగా మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని తెలుస్తోంది. ఆ చర్చ ఏ అంశంపై జరిగిందనే విషయం స్పష్టంగా తెలియకపోయినా, జట్టు ప్రస్తుత ప్రదర్శనపై ఆందోళన కారణంగా ఈ చర్చ జరిగి ఉండొచ్చని సమాచారం సూచిస్తోంది.
ఈ సీజన్లో కేకేఆర్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, వరుస పరాజయాలు ఎదుర్కోవడం జట్టుపై ఒత్తిడిని పెంచినట్టు భావిస్తున్నారు. వేలంలో భారీగా ఖర్చు చేసిన ఆటగాళ్లు గాయాలు, అందుబాటులో లేకపోవడం కూడా పరిస్థితిని క్లిష్టంగా మార్చినట్టు తెలుస్తోంది. మ్యాచ్ ఆగిన సమయంలో జరిగిన ఈ సంఘటన జట్టులోని అంతర్గత పరిస్థితులపై చర్చలకు దారితీసింది. అయితే అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంతో, ఈ చర్చపై స్పష్టత రాలేదు.

