కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్లో (Nizamabad) యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఛాత్రోంకి గూంజ్” కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుణేలో నిర్వహించిన “ఛాత్రోంకి గూంజ్” లైవ్ కార్యక్రమాన్ని మహేష్ కుమార్ గౌడ్ వీక్షించారు.
విద్యార్థులు, యువతకు సంబంధించిన అంశాలు, వారి సమస్యలు, భవిష్యత్ అవకాశాలపై నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, స్టేట్ కార్పొరేషన్ ఛైర్మన్లు తాహెర్ బిన్ హమ్దాన్, శేఖర్ గౌడ్, పీపీ దయాకర్ గౌడ్, మనాల మోహన్ రెడ్డి,నరాల రత్నాకర్, మజీద్ ఖాన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

