కలం, వెబ్ డెస్క్ : ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కించి మూవీ ‘ది రాజా సాబ్’ (Raja Saab). భారీ బడ్జెట్ తో నిర్మించిన హారర్–ఫాంటసీ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రాజాసాబ్ ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి. అలాగే తమిళనాడు, కర్ణాటకలో బుకింగ్స్ తెరుచుకున్నాయి. మరోవైపు నైజాంలో ప్రీమియర్ షోల పై చివరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగినా ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.
కాగా, గురువారం రాత్రి ప్రీమియర్ షోలు పడుతాయని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి ది రాజాసాబ్ నిర్మాతలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం నిర్మాతలకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారు తెలంగాణ ప్రభుత్వానికి టికెట్ రేట్స్ హైక్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. కానీ, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గురువారం రాత్రి వరకు వేచి చూసిన ప్రీమియర్ షోస్ పడలేదు. ప్రీమియర్ షోలు రద్దు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ లో తీవ్ర అసహనానికి దారితీసింది. ఇక సాధారణ టికెట్ ధరలతోనే Raja Saab సినిమా తెలంగాణలో విడుదల కానుంది.


